No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Apr 7 2024 2:05 AM

- - Sakshi

కరీంనగర్‌రూరల్‌: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్‌ మండలం గుంటూరుపల్లిలో శనివారం చల్మెడ ఆనందరావు ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యవిద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ అసీంఅలీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా వైద్యులు, విద్యార్థులు గ్రామంలోని ప్రధాన వీధుల్లో ప్లకార్డులతో నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు స్కిట్లు, డ్యాన్సుల ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్‌ ఎం.సత్యనారాయణ, వైద్యులు రాజమౌళి, సచిన్‌, పీజీ విద్యార్థులు ఫయాజ్‌, వాజీద, ప్రత్యూష, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement