ఫొటోలు తీసి... బెదిరించి.. | Sakshi
Sakshi News home page

ఫొటోలు తీసి... బెదిరించి..

Published Mon, Apr 8 2024 1:15 AM

మోహన్‌  - Sakshi

జగిత్యాలక్రైం: ఓ వివాహితను బ్లాక్‌మెయిల్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డ నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. సీఐ కథనం మేరకు.. జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహితను జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టీఆర్‌నగర్‌కు చెందిన కోటగిరి మోహన్‌ జనవరి నెలలో పరిచయం చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఎగ్జిబిషన్‌లో పని చేస్తోంది. మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు మొబైల్‌లో తీసుకున్నాడు. తర్వాత కోరిక తీర్చమని, లేకుంటే ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తూ ఆమైపె బలవంతంగా అత్యాచారం చేశాడు. ఎవరికీ భయపడనని, పోలీసు, ప్రెస్‌వాళ్లను కూడా బెదిరించానని, నాపై చాలా కేసులున్నాయని, నన్ను ఎవరు ఏం చేయరంటూ బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. బెదిరింపులు భరించలేక మహిళ ఫిర్యాదు చేయగా.. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 6 కేసులు, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో 5 కేసులు, కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు మొత్తం 12 కేసులున్నాయని పట్టణ సీఐ తెలిపారు.

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

Advertisement
Advertisement