మతసామరస్యానికి ఇఫ్తార్‌ ప్రతీక | Sakshi
Sakshi News home page

మతసామరస్యానికి ఇఫ్తార్‌ ప్రతీక

Published Mon, Apr 8 2024 1:15 AM

ఇఫ్తార్‌లో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌
 - Sakshi

కొత్తపల్లి: మతసామరస్యానికి ఇఫ్తార్‌ విందులు ప్ర తీకగా నిలుస్తాయని కరీంనగర్‌ పార్లమెంట్‌ బీ ఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. మాజీ జెడ్పీ చైర్మన్‌ తుల ఉమ, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు జమీల్‌, వైస్‌ ఎంపీపీ తిరుపతినాయక్‌, నాయకులు పిల్లి మహేశ్‌, చాంద్‌ పాషా, నజీమా, సలీం, వాజిద్‌, రైయిస్‌, జాంగిర్‌, అన్వర్‌, నఫీజా, సిద్దిక్‌ తదితరులు పాల్గొన్నారు.

‘భీమ్‌యాత్ర’ను

విజయవంతం చేయండి

కరీంనగర్‌: అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఈనెల 14న కిసాన్‌నగర్‌ నుంచి కోర్టు చౌరస్తా వరకు నిర్వహించే భీమ్‌యాత్రను జయప్రదం చే యాలని అంబేడ్కర్‌ యూత్‌ క్లబ్‌ ప్రతినిధులు కొమ్మల కరుణాకర్‌, అసంపల్లి సాయికిరణ్‌, దాసరి సాయిచరణ్‌, తాండ్ర రాజేశ్‌, నవీన్‌లు కోరారు. ఆ దివారం భీమ్‌యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే గంగు కమలలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ తుల ఉమ, కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌, శేఖర్‌, కొంకటి శేఖర్‌లు ఆవిష్కరించారు.

Advertisement
Advertisement