పోచమ్మ బోనాలు | Sakshi
Sakshi News home page

పోచమ్మ బోనాలు

Published Mon, Apr 8 2024 1:15 AM

22వ డివిజన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌లో.. - Sakshi

కరీంనగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలతో సందడిగా మారింది. చెర్లభూత్కూర్‌లో రెడ్డి సంఘం, చామనపల్లిలో కురుమ సంఘం, నగునూరులో మాల సంఘం ఆద్వర్యంలో పోచమ్మ బోనాలు చేశారు. మహిళలు బోనాలను తలపై ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించారు. తీగలగుట్టపల్లిలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పాల్గొని పోచమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ దబ్బెట రమణారెడ్డి, కరీంనగర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ పి.శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు కూర నరేశ్‌రెడ్డి, నల్ల శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, గాండ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. –కరీంనగర్‌/కరీంనగర్‌రూరల్‌

చెర్లభూత్కూర్‌లో బోనాలతో మహిళల ఊరేగింపు

తీగలగుట్టపల్లిలో..

నగునూరులో..

Advertisement
Advertisement