కరీంనగర్: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా 17వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరం రజనీకాంత్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా కాంపెల్లి అరవింద్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గజ్జెల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులుగా పూజ ,రోహిత్, శ్రీజ ,వినయ్, అభిలాష్. సహాయ కార్యదర్శులుగా ఇషాక్, బోగేష్ ,శ్రీజతో పాటు ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నామని అన్నారు.
భాగ్యనగర్ రెడ్డి సంక్షేమ సంఘం..
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని భాగ్యనగర్లో ఆదివారం నూతనంగా భాగ్యనగర్ రెడ్డి సంక్షే మ సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాకాల వెంకటేశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్రెడ్డి. కార్యదర్శిగా నర్ర నరోత్తంరెడ్డి, ఉపాధ్యక్షుడిగా బారాజు మోహన్రెడ్డి, కోశాధికారిగా పిన్నింటి నారాయణరెడ్డి, సలహాదారులుగా దాసరి తిరుపతిరెడ్డి, సంది రాజిరెడ్డి, కొంగల రాజిరెడ్డి, ఆర్ఎస్పీ రెడ్డి, గోలి సత్యనారాయణరెడ్డి, దామెర రాజేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, ఆకారపు శ్రీనివాసరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డిని నూతన కమిటీ సన్మానించింది.