మధురం గానామృతం | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 24 2023 7:36 AM

-

ప్రశాంతి నిలయం: సత్యసాయి వైభవాన్ని చాటుతూ మధుర స్వరాలతో నిర్వహించిన సంగీత కచేరితో భక్తులు తన్మయులయ్యారు. గురువారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి హయ్యర్‌ లర్నింగ్‌ సంగీత కచేరి బృందం విద్యార్థులు గానాలాపనను నిర్వహించారు.

సత్యసాయిని కీర్తిస్తూ ప్రేమ తత్వాన్ని కొనియాడుతూ నిర్వహించిన సంగీత కచేరి భక్తులను ఆద్యంతం ముగ్ధుల్ని చేసింది. సుమారు గంట పాటు కచేరీ సాగింది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement