శివాజీనగర: త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై 125 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు తీర్మానించారు. 71 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఖాయమైంది. ఉగాది పండుగ తరువాత జాబితా విడుదల చేయనున్నారు. కాగా, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఈసారి కోలారు నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. దీనిపై పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అభ్యంతరం తెలిపినట్లు వెల్లడైంది. సిద్దుకు సొంతమైన వరుణ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని రాహుల్ సలహా ఇచ్చారని తెలిసింది.
రాహుల్ అలా చెప్పలేదు: సిద్దు
కోలారు నుంచి పోటీ చేయొద్దని రాహుల్ సలహా తనకు ఎటువంటి సలహా ఇవ్వలేదని సిద్దరామయ్య చెప్పారు. రాహుల్ సలహా ఇచ్చారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాను ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయమన్నారు.