కేజీఎఫ్: ఈ ఖాతా ముసుగులో అక్రమాలు జరిగాయని, వెంటనే నగరసభను సూపర్పసీడ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేంద్రన్ డిమాండ్ చేశారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గౌతమ నగర్లో నిర్మించిన ఇళ్లకు ఈ ఖాతా చేయడానికి గతంలో నగరసభ అధ్యక్షురాలు, వార్డు సభ్యురాలు, ఆమె భర్త తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను వంచించారన్నారు. దీనిపై గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా దోషులైన అధికారులకు జరిమానా విధించారన్నారు. అయితే ఏడాది క్రితం ప్రస్తుత నగరసభ అధ్యక్షుడు వళ్లల్ మునిస్వామి, సభ్యురాలు శాలిని, ఆమె భర్త నందకుమార్లు అదే తరహా మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నగరసభను సూపర్సీడ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యవసాయ పథకాలపై అవగాహన
రాయచూరు రూరల్: రైతులు వ్యవసాయ పథకాలను వినియోగించుకొని అదాయం పెంచుకోవాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ దేవిక, తాలూకా అధికారి నయిముద్దీన్ సూచించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పించారు.