ఆదర్శనేత సురేశ్‌ గౌడ | Sakshi
Sakshi News home page

ఆదర్శనేత సురేశ్‌ గౌడ

Published Tue, May 2 2023 12:56 AM

- - Sakshi

తుమకూరు: సురేష్‌ గౌడ్‌ ఒక ఆదర్శవంతమైన నేత అని, మోసంతో గతంలో ఓడిపోయారని, ఈసారి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప పిలుపునిచ్చారు. తుమకూరు గ్రామీణ నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ సురేశ్‌ గౌడ వంటి ఎమ్మెల్యే ఇంకొకరు దొరకరని, ఎంతో ప్రామాణికంగా పని చేశారని కొనియాడారు. ఈసారి మాత్రం కచ్చితంగా చట్టసభకు సురేశ్‌ గౌడను పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మళ్లీ బీజేపీదే అధికారం
శివాజీనగర:
విధానసభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారం చేపడుతుందని బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీ.సీ.మోహన్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సోమవారం సర్వజ్ఞన నగర బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డికి మద్దతుగా బాణసవాడి, సేవానగర తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించి ప్రచారం చేపట్టి ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వ సాధనాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థులు గెలుపునకు అవకాశమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కే.జే.జార్జ్‌కు పోటీగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డిని గెలిపించాలన్నారు.

Advertisement
Advertisement