బైక్‌ ప్రమాదంలో నవ వివాహిత మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ ప్రమాదంలో నవ వివాహిత మృతి

Published Wed, Oct 4 2023 12:28 AM

-

క్రిష్ణగిరి: ప్రైవేట్‌ పరిశ్రమలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని భర్త కళ్ల ముందే భార్య మృతి చెందిన ఘటన ఊత్తంగేరి వద్ద చోటు చేసుకొంది. వివరాల మేరకు క్రిష్ణగిరి సమీపంలోని నడుపట్టి గ్రామానికి చెందిన ఆదిత్యన్‌, భార్య రోషిణి (20). వీరికి గత ఎనిమిది నెలల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భిణి. రోషిణి చైన్నెలోని ఒక ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తూ వచ్చింది. గత రెండు రోజుల క్రితం సెలవుపై ఇంటికొచ్చింది. ఈ నేపథ్యంలో క్రిష్ణగిరి ప్రాంతంలోనే ఉద్యోగం చేయాలని ఆమె అనుకుంది. ఇందుకోసం ఊత్తంగేరి సిఫ్‌కాట్‌లోని ప్రైవేట్‌ పరిశ్రమలో మంగళవారం ఇంటర్వ్యూ కోసమని భర్తతో కలిసి బైక్‌ మీద బయల్దేరారు. గెరిగేపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ఏదో వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలేర్పడిన రోషిణి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆదిత్యన్‌కు తీవ్ర గాయాలు తగిలాయి. గమనించిన స్థానికులు ఆధిత్యన్‌ను ఆస్పత్రికి తరలించి ఊత్తంగేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోషిణి శవాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

భర్త కళ్ల ముందే ఘోరం

Advertisement
Advertisement