నేడు హాసనాంబె గుడికి తాళం | Sakshi
Sakshi News home page

నేడు హాసనాంబె గుడికి తాళం

Published Wed, Nov 15 2023 12:16 AM

-

యశవంతపుర: హాసనాంబె ఆలయానికి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తాళం వేయనున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు బారులు తీరారు. దీపావళి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో సోమ, మంగళవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మధ్యాహ్నం కలెక్టర్‌ ఆలయానికి తాళం వేయనున్నారు. గుడి తెరిచి నాటి నుంచి గంటకు మూడు వేల మంది చొప్పున దాదాపు 10 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత బస్సుల ద్వారా మహిళలే ఎక్కువ మంది హాసనాంబెను దర్శించుకున్నారు. 80 ప్రత్యేక బస్సులను నడిపారు.

Advertisement
Advertisement