కారుపై ఆయిల్‌ వేసి నగలు దోచారు | Sakshi
Sakshi News home page

కారుపై ఆయిల్‌ వేసి నగలు దోచారు

Published Sun, Nov 19 2023 12:14 AM

నగల బ్యాగ్‌తో బైక్‌పై ఉడాయిస్తున్న దొంగలు     (ఇన్‌సెట్‌లో) బాధితుడు నవీన్‌ 
 - Sakshi

రాయచూరు రూరల్‌: దుండగులు ఓ ఉద్యోగిని ఏ మార్చి బంగారు నగలు దోచుకున్న ఉదంతం మాన్విలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నవీన్‌ అనే వ్యక్తి బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. భార్య సీమంతం కోసం మాన్విలోని బ్యాంకులో ఉన్న నగలు విడిపించాడు. ఆనగలను తీసుకొని కారులో ఇంటికి వెళ్తుండగా పసిగట్టిన దుండగులు వాహనంపై ఆయిల్‌ చల్లారు. కారును ఆపి ఆయిల్‌ పడిందని చెప్పారు. నవీన్‌ కిందకు దిగి చూసుకుంటుండగా దుండగులు నగలు ఉన్న బ్యాగ్‌తో బైక్‌పై ఉడాయించారు. నవీన్‌ గట్టిగా కేకలు వేసినా ప్రయోజనం లేక పోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలంలో ఉన్న సీసీకెమెరాలను పరిశీలించగా నిందితులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement