ఇద్దరి నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తాం | Sakshi
Sakshi News home page

ఇద్దరి నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తాం

Published Sun, Nov 19 2023 12:14 AM

మాట్లాడుతున్న ఎంపీ కరడి సంగణ్ణ  - Sakshi

గంగావతి: వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఇరువురి నేతృత్వంలో ఎదుర్కొంటామని కోప్పళ ఎంపీ కరడిసంగణ్ణ పేర్కొన్నారు. ఆయన శనివారం తన జన్మదినం రోజున అభిమానులతో సన్మానాలు అందుకొని విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత బీజేపీ నూతన అధ్యక్షుడు విజయేంద్ర, మరో సీనియర్‌ నేత ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. 28 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన 5 గ్యారంటీ పథకాలు రివర్స్‌ అయ్యాయని, దీంతో ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పాలన, దేశాభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కడతారని జోస్యం పలికారు.

Advertisement
Advertisement