ఎల్‌ఈడీ తెరపై రాళ్ల దాడి | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ తెరపై రాళ్ల దాడి

Published Tue, Nov 21 2023 12:26 AM

లైవ్‌ నిలిచిపోవడంతో గందరగోళం - Sakshi

హొసపేటె: క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి అంచున ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎల్‌ఈడీ స్క్రీన్‌పైకి రాయి విసిరిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. భారత్‌, ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఫైనల్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు వీక్షించడానికి ఇక్కడి డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జిల్లా స్టేడియంలో యువజన సేవా, క్రీడా శాఖ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేసింది. మ్యాచ్‌ చూసేందుకు వందలాది మంది తరలివచ్చారు. భారత్‌ ఓడిపోతోందని అందరూ నిరాశ చెందారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో పరాజయం ఖాయం కాగా, గుంపులో కూర్చున్న ఓ వ్యక్తి ఆక్రోశం పట్టలేక తెరపైకి రాయి విసిరడంతో స్క్రీన్‌ పగిలిపోయింది. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఈ కేసులో ఓ వ్యక్తిని విచారించినా తాను కాదంటూ పోలీసుల ఎదుటే కారు ఎక్కి వెళ్లి పోయాడు. తెరపైకి రాయి విసరడంతో క్రికెట్‌ మ్యాచ్‌ ప్రసారం నిలిచిపోగా ఉసూరంటూ వెళ్లిపోయారు.

Advertisement
Advertisement