వేడుకగా బసవణ్ణ విగ్రహావిష్కరణ | Sakshi
Sakshi News home page

వేడుకగా బసవణ్ణ విగ్రహావిష్కరణ

Published Thu, Nov 23 2023 12:48 AM

బసవణ్ణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న 
ప్రజాప్రతినిధులు, ప్రముఖులు - Sakshi

హొసపేటె: కొట్టూరు స్వామి సంస్థానమఠం సంగనబసవ స్వామీజీ స్వర్ణ మహోత్సవం సందర్భంగా బుధవారం సిద్దిప్రియ కళ్యాణ మంటపం వద్ద విశ్వగురు బసవణ్ణ అశ్వారూఢ విగ్రహావిష్కరణను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కాంస్య విగ్రహావిష్కరణ ముందు వివిధ తాలూకాల నుంచి వచ్చిన నంది కోలు, పగటి వేషాలు, డోలు కుణితతో పాటు వివిధ కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకొన్నాయి. మంత్రి మాట్లాడుతూ సుమారు 12 అడుగుల ఎత్తైన ఈ కాంస్య విగ్రహాన్ని తాను ప్రారంభించడం తన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప, బసవలింగ స్వామీజీతో పాటు రాజకీయ నేతలు, సమాజ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Advertisement