జై శ్రీరామ్‌ నాదాలతో మార్మోగిన అగర | Sakshi
Sakshi News home page

జై శ్రీరామ్‌ నాదాలతో మార్మోగిన అగర

Published Sun, Dec 17 2023 10:20 AM

- - Sakshi

బొమ్మనహళ్లి: అయోధ్యలో శ్రీరామ మందిరం పూర్తవుతున్న తరుణంలో అక్కడి నుంచి వచ్చిన అక్షింతలు ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈపాటికే బెంగళూరు నగరానికి చేరుకున్న శ్రీరాముడి పవిత్ర అక్షింతలు వర్తూరు నుంచి శనివారం బొమ్మనహళ్లి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ అగర గ్రామానికి చేరుకోవడంతో బొమ్మనహళ్లి బీజేపీ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు శ్రీరాముడి అంక్షితలకు ఘన స్వాగతం పలికారు. బొమ్మనహళ్ళి బీజేపీ యువ మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెడ్డి, మాజీ కార్పోరేటర్‌ గురుముర్తి రెడ్డి పాల్గొని శ్రీరాముడి అంక్షితలకు మహిళల కలశాలతో స్వాగతం పలికారు. అనంతరం అగర ఆంజనేయ స్వామి ఆలయం, రాములవారి ఆలయంలో పూజలు చేశారు.

Advertisement
Advertisement