అనుమానాస్పదంగా రిటైర్డ్‌ టీచర్‌ మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా రిటైర్డ్‌ టీచర్‌ మృతి

Published Sun, Dec 17 2023 10:22 AM

-

హుబ్లీ: అనుమానాస్పదరీతిలో రిటైర్డ్‌ ఉపాధ్యాయిని మృతి చెందిన ఘటన ధార్వాడ ఓం నగర్‌లో చోటు చేసుకుంది. గిరిజా నడూరమఠ మృతురాలు(63). ఈమె రిటైర్డ్‌ ఉపాధ్యాయిని. ఈమెకు తోడుగా ఇంట్లో ఎవరూ లేరు. మూడు రోజుల క్రితమే చనిపోయినట్లు అంచనా. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండగా పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి వచ్చిన విద్యాగిరి పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించగా గిరిజా మృతి చెంది ఉన్నారు. శవం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఆమె మృతిపై విద్యాగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement