Sakshi News home page

ఆటోడ్రైవర్‌ ఇంట్లో బావా మరదళ్ల ఆత్మహత్య

Published Tue, Dec 19 2023 12:46 AM

- - Sakshi

కర్ణాటక: కొంత డబ్బు వస్తుంది కదా అని గది ఇచ్చిన పాపానికి ఆటోడ్రైవర్‌ ఇబ్బందుల్లో పడ్డాడు. నగరంలోని మురార్జీ నగరలో బెంగళూరుకు చెందిన ఓ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. బెంగళూరులోని పీణ్యాకు చెందిన శాంతి, ఆమె బావ లోకేష్‌ ఆత్మహత్య చేసుకున్న జోడి. బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం హుబ్లీలోని అక్షయ పార్క్‌కు వచ్చిన ఈ జంట కొద్దిసేపు ఫ్రెషప్‌ కావడానికి గది కావాలని ఆటో డ్రైవర్‌ మారుతి పుండలీకరావ్‌ జాధవ్‌ను కోరారు.

తక్కువ ఖర్చు ఉండాలని వారు కోరగా జాధవ్‌ నేరుగా తన ఇంటికే తీసుకెళ్లాడు. వారిద్దరినీ ఇంట్లో వదిలి మరో బాడుగ వస్తే ఆటోడ్రైవర్‌ వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత తట్టినా తీయలేదు, దీంతో పోలీసులకు కాల్‌ చేశాడు. వారు వచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఇద్దరూ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

అక్రమ సంబంధమే కారణం
శాంతికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ తన అక్క భర్త లోకేష్‌తో అక్రమ సంబంధం నెరుపుతోంది. ఇది తెలిసి అక్క తీవ్రంగా మందలించడంతో ఇద్దరూ ఇల్లు వదిలి వచ్చి ప్రాణాలు తీసుకున్నారు. పాత హుబ్లీ పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బంధువులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement