విద్యార్థిని కిడ్నాప్‌.. డ్రైవర్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

విద్యార్థిని కిడ్నాప్‌.. డ్రైవర్‌ అరెస్ట్‌

Published Tue, Dec 19 2023 12:46 AM

మారథాన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మంజుల  - Sakshi

హోసూరు: హోసూరు పారిశ్రామిక ప్రాంతంలో పదవ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్‌ చేసిన కారు డ్రైవర్‌ను మహిళా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు... హోసూరు పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. రెండు రోజుల క్రితం పాఠశాలకెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించారు. జాడ తెలియకపోవడంతో మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి సూళగిరి సమీపంలోని నీలివంక గ్రామానికి చెందిన వెంకటేష్‌ను అరెస్ట్‌ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేసి సేలం జైలుకు తరలించారు.

వైట్‌ఫీల్డ్‌లో మిడ్‌నైట్‌ మారథాన్‌

కృష్ణరాజపురం: నగరంలోని మహాదేవపుర నియోజకవర్గం వైట్‌ఫీల్డ్‌ కేటీపిఓలో మిడ్‌నైట్‌ మారథాన్‌ను ఎమ్మెల్యే మంజుల లింబావళి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... 16 ఏళ్లుగా బెంగళూరు మిడ్‌నైట్‌ మారథాన్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారని రోటరీ సంస్థను అభినందించారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి రోటరీ సంస్థ ఈ మారథాన్‌ను నిర్వహిస్తున్నారని అన్నారు.

వెంకటేష్‌
1/1

వెంకటేష్‌

Advertisement
Advertisement