హత్య కేసులో జీవిత ఖైదు | Sakshi
Sakshi News home page

హత్య కేసులో జీవిత ఖైదు

Published Mon, Mar 4 2024 1:05 AM

-

కోలారు: హత్యకేసులో నిందితుడుకి జీవితఖైదు శిక్షను విధిస్తూ ముళబాగిలు సెషన్స్‌ కోర్టు శనివారం తీర్పును వెలువరించింది. ముళబాగిలు నగరానికి చెందిన సుప్రీత్‌ (25) నిందితుడు. 2020లో సుప్రీత్‌, అతని స్నేహితుడు గొర్రెల వ్యాపారం చేసే నెపంతో వెళ్లి గొర్రెల యజమాని మునిస్వామి గౌడను హత్య చేశారు. ఘటనపై మునిస్వామి గౌడ కుమారుడు చంద్రు ముళబాగిలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సుప్రీత్‌ను అరెస్టు చేసి కోర్టుకు చార్జ్‌షీట్‌ సమర్పించారు. సుధీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంలో న్యాయమూర్తి దేవమానె నిందితుడు సుప్రీత్‌కు జీవితఖైదును విధిస్తూ తీర్పు చెప్పారు. మృతుడి కుటుంబానికి పరిహారం అందించాలని తీర్పులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement