ఈసారి గెలిపిస్తే రూపురేఖలు మారుస్తా | Sakshi
Sakshi News home page

ఈసారి గెలిపిస్తే రూపురేఖలు మారుస్తా

Published Thu, Mar 28 2024 12:35 AM

ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి శ్రీరాములు  - Sakshi

సాక్షి,బళ్లారి: మే 7న జరగనున్న బళ్లారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బీ.శ్రీరాములు అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన బుధవారం గ్రామీణ నియోజకవర్గంలోని హలకుంది, ఎత్తినబూదిహాల్‌, రూపనగుడి, పీడీహళ్లి, అమరాపుర తదితర గ్రామాల్లో ముమ్మరంగా కలియతిరిగి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ఆయా గ్రామాల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాములుకు ఘన స్వాగతం పలికారు. ఈసారి తనను గెలిపిస్తే జిల్లా రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఈసారి గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఉంటాయన్నారు. దేశభద్రత, రక్షణ, అభివృద్ధికి మోదీని మూడోసారి ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మోదీ నాయకత్వానికి 400 సీట్లకు పైగా వస్తాయన్నారు. బళ్లారి లోక్‌సభతో ప్రారంభమైన విజయయాత్ర మోదీకి అంకితం కావాలన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మోకా, ఎమ్మెల్సీ సతీష్‌, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు ఓబుళేసు, డాక్టర్‌ అరుణ కామినేని, బీజేపీ ప్రముఖులు మహిపాల్‌, గురులింగనగౌడ, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement