దాడి ఘటనలో ఎంపీటీసీ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

దాడి ఘటనలో ఎంపీటీసీ అరెస్ట్‌

Published Fri, May 26 2023 12:00 AM

-

చుంచుపల్లి: భూ వివాదం నేపథ్యంలో జరిగి న ఘర్షణ కేసులో మండలంలోని సర్వారం ఎంపీటీసీ బానోత్‌ విజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ సుమన్‌ కథనం ప్రకారం.. చుంచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత నెలలో భూ వివాదంలో గుగులోతు తారాబా యి అనే మహిళ కుమారుడు సందీప్‌ను ఎంపీటీసీ కర్రతో కొట్టి గాయపర్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారు కాగా, బుధవారం రాత్రి వరంగల్‌లో అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ నిమిత్తం గురువారం కోర్టుకు తరలించారు. బానోత్‌ విజయ్‌పై గతంలో కూడా కొన్ని కేసులు నమోదుకావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అతనిపై రౌడీషీట్‌ తెరుస్తామని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement