విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

Published Sat, Jul 15 2023 12:20 AM

 విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందిస్తున్న 
లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు - Sakshi

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మం గాంధీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన రూ.20 వేల విలువైన 500 పేట్లు, గ్లాసులను లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు శుక్రవారం అందజేశారు. అమెరికాలోని బోస్టన్‌లో లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌గా సీహెచ్‌ శివప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించి స్వదేశానికి వచ్చిన సందర్భంగా వీటిని అందజేసినట్లు క్లబ్‌ బాధ్యులు తెలిపారు. ఖమ్మం లయన్స్‌ క్లబ్‌ మాజీ గవర్నర్‌ మురళీధర్‌రావు, పాఠశాల హెచ్‌ఎం రుక్మాంధర్‌రావు, క్లబ్‌ అధ్యక్షుడు తల్లపురెడ్డి కృష్ణారెడ్డితో పాటు హన్మంతరావు, జనార్దన్‌రావు, కె.గోపాల్‌రావు, విశ్వేశ్వరరావు, నవీన్‌, దుర్గానాగేశ్వరరావు, సాంబశివరావు, సుబ్బారావు, శ్రీనివాసరావు, ఆర్తి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement