తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే.. | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే..

Published Thu, Nov 9 2023 12:18 AM

మాట్లాడుతున్న సునీల్‌ దియోదర్‌, పక్కన నాయకులు  - Sakshi

సత్తుపల్లి: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోదర్‌ ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయని, బీసీ సీఎం నినాదంతో ఆ వర్గాల వారందరూ బీజేపీకి ఓటు వేయనున్నారని చెప్పారు. మరోపక్క మంద కృష్ణమాదిగ ఆధ్వర్యాన ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు కూడా తమకే పడతాయని తెలిపారు. ఇదే సమయాన సత్తుపల్లి నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గానికి త్వరలో ప్యాసింజర్‌ రైలు వస్తుందని సునీల్‌ తెలిపారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి నంబూరు రామలింగేశ్వరరావు, నాయకులు నాయుడు రాఘవరావు, సుదర్శన్‌ మిశ్రా, భాస్కర్ణి వీరంరాజు పాల్గొన్నారు.

పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్‌దియోదర్‌

Advertisement
Advertisement