Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ స్థాయి బోధన..

Published Sat, Nov 11 2023 12:10 AM

నేలకొండపల్లిలో విద్యార్థుల సామర్థ్యాలపై 
ఆరాతీస్తున్న డైరెక్టర్‌ శ్రీనివాసాచారి  - Sakshi

● రాష్ట్రంలో విద్యార్థులకు 2.3 కోట్ల పుస్తకాలు ఇచ్చాం ● రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసాచారి

నేలకొండపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడమే కాక విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెంలో పలు పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించడంతో పాటు తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందుగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఈ ఏడాది 2.3 కోట్ల పుస్తకాలు సరఫరా చేశామని చెప్పారు. మెరుగైన ఫలితాలు నమోదయ్యేలా ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బి.రాములు, హెచ్‌ఎం హరి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement