●ఓటు విలువ తెలుసుకో ! | Sakshi
Sakshi News home page

●ఓటు విలువ తెలుసుకో !

Published Fri, Nov 17 2023 12:16 AM

- - Sakshi

ఓటు హక్కు నమోదు, ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలు, బహిరంగ ప్రదేశాల్లో వాల్‌రైటింగ్‌ల ద్వారా అధికారులు అవగాహన కల్పించారు. ఇప్పుడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసిన పాఠశాలలు, కార్యాలయాల్లోని గోడలపై కూడా నినాదాలు రాయిస్తున్నారు. ఓటు అమ్ముకోకు.. వ్యక్తిత్వాన్ని కోల్పోకు, సరైన అభ్యర్థికే ఓటు వేయండి, భయం లేకుండా ఓటు వేసుకోవాలి, బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌ విలువైనది.. నినాదాలు రాయిస్తుండగా ఓటు వేసేందుకు వచ్చేవారిని ఆలోచింపచేయడం ఖాయమని చెబుతున్నారు. – నేలకొండపల్లి

Advertisement
Advertisement