Sakshi News home page

ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రారంభం

Published Tue, Nov 21 2023 12:20 AM

ఈవీఎంలను పరిశీలిస్తున్న అబ్జర్వర్‌ మహంతి, కలెక్టర్‌ గౌతమ్‌  - Sakshi

ఖమ్మంసహకారనగర్‌: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఖరారయ్యాక పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఎన్నికల సంఘం అదనపు బ్యాలెట్‌ యూనిట్లను కేటాయించింది. ఈ యూనిట్లు ఇటీవల ఖమ్మం చేరుకోగా, సోమవారం మొదటి దశ తనిఖీ చేపట్టారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో పార్టీల ప్రతినిధుల సమక్షాన చెకప్‌ మొదలుపెట్టగా.. ఎన్నికల పరిశీలకులు తుషార్‌ కాంత మహంతి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు అదనంగా జిల్లాకు కేటాయించిన 894 బ్యాలెట్‌ యూనిట్ల తనిఖీ పూర్తయ్యాక.. ర్యాండమైజేషన్‌ ద్వారా నియోజకవర్గాలకు కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే, 23, 24వ తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో చేపట్టే ఈవీఎం, వీవీ ప్యాట్ల కమీషనింగ్‌కు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement