Sakshi News home page

టీఎన్జీవోస్‌ సంబురాలు

Published Sat, Dec 9 2023 12:16 AM

కేక్‌ కట్‌ చేస్తున్న అఫ్జల్‌హసన్‌, తదితరులు - Sakshi

ఖమ్మంసహకారనగర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్జీవోస్‌ బాధ్యులు శుక్రవారం సంబురాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు కేక్‌లు కట్‌ చేశారు. ఇక ఖమ్మంలోని కలెక్టరేట్‌లో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌ హసన్‌ కేక్‌ కట్‌ చేసి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అఫ్జల్‌ హసన్‌ మాట్లాడుతూ జిల్లా నేతలను డిప్యూటీ సీఎంతో రెండు మంత్రి పదవులు దక్కిన నేపథ్యాన అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందగిరి శ్రీనుతో పాటు జీ.ఎస్‌.ప్రసాద్‌రావు, నాగుల్‌మీరా, వెంకటరెడ్డి, శివస్వప్న, సవర్జన్‌ పాల్‌, భాస్కర్‌, వై.శ్రీనివాసరావు, పాషా, శాబాసు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement