నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

Published Thu, Dec 14 2023 12:10 AM

- - Sakshi

రాష్ట్రంలో ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, తొలి అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్నారు. కొత్త ప్రభుత్వానికి తోడు కొత్తగా ఎన్నికై న నేపథ్యాన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు జాబితా సిద్ధం చేసుకున్నారు. పలు ప్రాధాన్యత అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనుండడంతో తమకు అవకాశం వస్తే నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించేందుకు ఎమ్మెల్యేలు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో పలు ప్రధాన సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నందున కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మోక్షం కలుగుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ప్రాధాన్యత అంశాలపై చర్చకు అవకాశం

సమస్యల జాబితాతో వెళ్లిన ఎమ్మెల్యేలు

పెండింగ్‌ సమస్యలను ప్రస్తావించేందుకు సన్నద్ధం

Advertisement
Advertisement