కిక్కిరిసిన బస్టాండ్లు | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన బస్టాండ్లు

Published Mon, Jan 15 2024 12:08 AM

-

ఖమ్మం మామిళ్లగూడెం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అయినప్పటికీ పండుగకు అంతా ఒకేసారి స్వస్థలాలకు బయలుదేరడంతో ఖమ్మం రీజియన్‌లోని అన్ని బస్టాండ్లు ఆదివారం కిటకిటలాడుతూ కనిపించాయి. హైదరాబాద్‌ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 66 రిజర్వేషన్‌ సర్వీసులు, 220 ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడిపిస్తున్నారు. మొత్తం ప్రత్యేక సర్వీసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ రూట్‌కు కేటాయించినప్పటికీ రద్దీ కొనసాగింది. ఇక మహాలక్ష్మి పథకంతో ఈసారి మహిళా ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సులను ఆశ్రయిస్తుండగా ఆ బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంది. వీటికి తోడు సూపర్‌ లగ్జరీ, రాజధాని బస్సుల్లోనూ 100శాతం ఓఆర్‌ నమోదవుతోందని అధికారులు వెల్లడించారు. కాగా, బస్సుల్లో రద్దీ సోమ, మంగళవారాల్లో కాస్త తగ్గే అవకాశముండగా.. మళ్లీ బుధవారం నుంచి తిరుగు పయనమయ్యే వారితో బస్సులన్నీ కిటకిటలాడనున్నాయి.

Advertisement
Advertisement