జాతీయస్థాయి క్రీడల్లో సత్తా | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి క్రీడల్లో సత్తా

Published Mon, Apr 8 2024 12:10 AM

క్రీడాకారులతో కేటీపీఎస్‌ సీఈలు వెంకటేశ్వరరావు, ప్రభాకర్‌రావు - Sakshi

పాల్వంచరూరల్‌ : జాతీయ స్థాయి ఎలక్ట్రిసిటీ బోర్డు క్రీడోత్సవాల్లో కేటీపీఎస్‌ క్రీడాకారులు సత్తా చాటారు. హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో గతనెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగిన టోర్నమెంట్‌లో కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల క్రీడాకారులు క్యారమ్స్‌ పోటీలో ప్రథమ, చదరంగం, లాన్‌టెన్నిస్‌లో ద్వితీయస్థానాలు కై వసం చేసుకున్నారు. ఇంకా టెన్నికాయిట్‌లో ప్రథమ, షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ద్వితీయ స్థానాలు సాధించారు. కాగా, ప్రతిభ చాటిన క్రీడాకారులను ఆదివారం కేటీపీఎస్‌ సీఈలు ప్రభాకర్‌రావు, వెంకటేశ్వరరావు అభినంధించారు. కార్యక్రమంలో ఇంజనీర్లు కె.శ్రీనివాసబాబు, యుగపతి, ఎస్‌.ఎన్‌ ఎస్‌.శేఖర్‌, వై.వెంకటేశ్వర్లు, టి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement