కలెక్టర్‌ను కలిసిన సివిల్స్‌ ర్యాంకర్‌ | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన సివిల్స్‌ ర్యాంకర్‌

Published Tue, Apr 23 2024 8:20 AM

సాయి అలేఖ్యను సన్మానిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, పక్కన అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ - Sakshi

ఖమ్మం సహకారనగర్‌/ఖమ్మం క్రైం/ఖమ్మం మయూరిసెంటర్‌: ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 938వ ర్యాంక్‌ సాధించిన బోనకల్‌ మండలం గోవిందాపురం(ఎల్‌)కు చెందిన సాయి అలేఖ్య సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్‌ సత్కరించారు. ఆతర్వాత సీపీ సునీల్‌దత్‌ను కూడా కలవగా ఆయన సాయిఅలేఖ్యతో పాటు ఆమె తండ్రి మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రావూరి ప్రకాశ్‌రావు – పద్మశ్రీ దంపతులను సన్మానించారు. అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మ్రినాల్‌ శ్రేష్ఠ, ఏఎస్పీ అవినాష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక సాయి అలేఖ్యను ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్‌లో సత్కరించారు. స్టడీసర్కిల్‌లో గ్రూప్స్‌, డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటుచేయగా.. ఆమె పాల్గొని ఉద్యోగాలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, సాయిఅలేఖ్య చదువుకున్న త్రివేణి పాఠశాల, సెంచరీ స్కూల్‌లో కూడా ఆమెను సన్మానించారు. త్రివేణి డైరెక్టర్లు గొల్లపుడి వీరేంద్రచౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ రాజేంద్రప్రసాద్‌తో పాటు సీహెచ్‌.అప్పారావు, స్వప్న, ముస్తఫా, అశోక్‌, చార్లెస్‌, సందీప్‌, సెంచరీ స్కూల్‌లో కరస్పాండెంట్‌ డీవీఎస్‌.ప్రభాకర్‌రావు, డైరెక్టర్‌ మాధవీలతతో పాటు స్వరూప, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సాయిఅలేఖ్యను సన్మానించిన

కలెక్టర్‌, సీపీ

అలేఖ్య, ఆమె తల్లిదండ్రులను సత్కరిస్తున్న 
సీపీ సునీల్‌దత్‌
1/1

అలేఖ్య, ఆమె తల్లిదండ్రులను సత్కరిస్తున్న సీపీ సునీల్‌దత్‌

Advertisement
Advertisement