‘స్థలం కబ్జా చేస్తే ఊరుకోం’ | Sakshi
Sakshi News home page

‘స్థలం కబ్జా చేస్తే ఊరుకోం’

Published Mon, Nov 13 2023 11:52 PM

ప్రహరీని తొలగిస్తున్న మహిళలు
 - Sakshi

ఆసిఫాబాద్‌రూరల్‌: వీవోఏల సంఘం భవ నం కోసం కేటాయించిన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తే ఊరుకోమని వీవోఏల సంఘం సభ్యులు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తారకరాంనగర్‌లో వీవోఏల సంఘానికి కేటా యించిన స్థలాన్ని హసన్‌ అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశార ని వారు ఆరోపించారు. స్థలానికి చుట్టూ వేసి న ప్రహరీని సోమవారం పలువురు సభ్యులు తొలగించారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. వీవోఏల సంఘం సభ్యులు అర్చన, సునీత, ఫాతిమా, శ్రీలత, రమ్య, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement