‘గల్ఫ్‌ బోర్డు హామీ ఇచ్చిన వారికే మద్దతు’ | Sakshi
Sakshi News home page

‘గల్ఫ్‌ బోర్డు హామీ ఇచ్చిన వారికే మద్దతు’

Published Mon, Nov 20 2023 1:36 AM

అభివాదం చేస్తున్న భూమన్న
 - Sakshi

జన్నారం: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు చేసి, రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన పార్టీకే గల్ఫ్‌ కార్మికులందరూ మద్దతు తెలపాలని తెలంగాణ గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమన్న సూచించారు. జన్నారంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దుబాయ్‌, బొగ్గుబా యి, బొంబాయి అంటూ గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. ఉపాధికోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కార్మికులు వివిధ కారణాలతో అర్థంతరంగా చనిపోతున్నారని తెలిపారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్‌ సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆదుకునే పార్టీకి మద్దతు తెలుపాలని సంఘం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో గల్ఫ్‌ కార్మికులు పోటీలో నిలబెట్టామని తెలిపారు. సమావేశంలో తెలంగాణ గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తిరుపతిగౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement