మంత్రివర్గంలో వివేక్‌కు చోటు కల్పించాలి | Sakshi
Sakshi News home page

మంత్రివర్గంలో వివేక్‌కు చోటు కల్పించాలి

Published Tue, Dec 5 2023 5:10 AM

సమావేశంలో మాట్లాడుతున్న ప్రజ్ఞాకుమార్‌ - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: మాల, మాల ఉపకుల సామాజిక వర్గం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న గడ్డం వివేక్‌కు గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉందని, మంత్రివర్గ విస్తరణలో చోటుకల్పించాలని భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్‌ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహా ప్రజ్ఞా బుద్ధ వీహార్‌ ప్రాంగణంలో భారతీయ బౌద్ధ మహాసభ, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ, మాల యువసేన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ము ఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి కృషి చేస్తుందని నమ్ముతున్నామన్నారు. ఈ సమావేశంలో షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా యూత్‌ అధ్యక్షులు మస్కే రాజు, మాల యువసేన జిల్లా అధ్యక్షులు ఆర్‌ ఉదయ్‌ కుమార్‌, సంఘమిత్ర వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి పటాడే రాజు, వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌, నాయకులు సుఖదేవ్‌, సురేష్‌, బోరేకర్‌ నందు కుమార్‌, మూడే ప్రమోద్‌, ఆర్‌ విశ్వనాధ్‌, తాడే రాహుల్‌, జాడే సిద్ధార్థ, వసంత్‌ ఉన్నారు.

Advertisement
Advertisement