కార్మికులందరికీ అండగా ఉంటాం | Sakshi
Sakshi News home page

కార్మికులందరికీ అండగా ఉంటాం

Published Tue, Jan 30 2024 11:30 PM

మాట్లాడుతున్న వాసిరెడ్డి సీతారామయ్య - Sakshi

● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

రెబ్బెన(ఆసిఫాబాద్‌): యూనియన్లతో సంబంధం లేకుండా కార్మికులందరికీ అండగా ఉండి వారి సమస్యలపై పోరాడుతామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీలో ఏఐటీయూసీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీతారామయ్య మాట్లాడుతూ ఏరియాలో ఏఐటీయూసీ గెలుపు కోసం కై రిగూడ కార్మికులు ఎంతో కృషి చేశారన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామన్నారు. ఒక యూనియన్‌ మరో యూనియన్‌కు ఏనాడు శత్రువు కాదని మన పోరాటం యాజమాన్యంతోనేనన్నారు. కార్మికులు ఐకమత్యంతో ఉండి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచి ఇన్‌చార్జి చిప్ప నర్సయ్య, బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి, బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కై రిగూడ ఉపాధ్యక్షుడు రహేమాన్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు జగ్గయ్య, శేషు, కి రణ్‌బాబు, రాజేశ్‌, చంద్రశేఖర్‌, దివాకర్‌, ఆనంద్‌, ఫిట్‌ కార్యదర్శులు మారం శ్రీనివాస్‌, రామయ్య, అ శోక్‌, రమేశ్‌, జహంగీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement