అక్రమంగా మొరం, ఇసుక తరలిస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

అక్రమంగా మొరం, ఇసుక తరలిస్తే చర్యలు

Published Wed, Jan 31 2024 11:12 PM

కొలతలు తీసుకుంటున్న ఏడీ నాగరాజు - Sakshi

రెబ్బెన(ఆసిఫాబాద్‌): అక్రమంగా మొరం, వాగుల నుంచి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని గనులు, భూగర్భశాఖ ఏడీ నాగరాజు హెచ్చరించారు. రెబ్బెన మండలం రాళ్లపేట శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టిన ప్రదేశాన్ని బుధవారం పరిశీలించారు. తవ్వకాలు చేపట్టిన వ్యక్తులకు రూ.22వేల జరిమానా విధించారు. అనంతరం శివారులో కొనసాగుతున్న సుద్ద క్వారీలను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తవ్వకాలు చేపడుతున్నారా.. లేదా అని పరిశీలించారు. సుద్ద తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించి కొలతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అక్రమంగా మొరం, ఇసుక తరలించొద్దని హెచ్చరించారు. తవ్వకాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement