ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో మార్చి 9న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన భవన సముదాయంలో జిల్లా న్యాయమూర్తులు కె.యువరాజు, అనంతలక్ష్మి, బా ర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్బాబులతో కలిసి బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీసు అధికారులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ లోక్అదాలత్ కార్యక్రమంలో రాజీ మార్గం ద్వారా అధిక కేసులు పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలన్నారు. న్యాయవాదులు, పోలీసులు సమన్వయంతో పని చేసి, కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 61 సైబర్క్రైం కేసులు నమోదైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నుంచి జాబితా పంపించారని, ఈ కేసులను ఫ్రీ లిటికేషన్ కేసుల కింద పరిష్కరించాలన్నారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకునే విధంగా చూడాలన్నారు.