చికిత్స పొందుతున్న యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న యువకుడి మృతి

Published Sat, Oct 28 2023 1:54 AM

మృతుడు ప్రకాష్‌  - Sakshi

అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు

చినముత్తేవి(మొవ్వ): మొవ్వ మండలం నిడుమోలు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి ప్రకాష్‌ (24) డీజే బాక్స్‌ల ఆపరేటింగ్‌్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో నిడుమోలు గ్రామంలో ఊరేగింపునకు వెళ్లిన వ్యక్తి పెట్రోల్‌ బంకు సమీపంలో రోడ్డు దాడుతుండగా మచిలీపట్నం నుంచి విజయవాడ వెళుతున్న ద్విచక్రవాహనం (యూనికాన్‌) ప్రకాష్‌ని ఢీ కొట్టింది. ఘటనలో తలకు తీవ్రగాయాల పాలై బాధితుడిని చికిత్స నిమిత్తం బందరు అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం చెందాడు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించటంతో విజయవాడ ఆయుష్‌ హాస్పటల్‌కు తరలించారు.

Advertisement
Advertisement