వ్యాను ఢీకొని పాల వ్యాపారి దుర్మరణం | Sakshi
Sakshi News home page

వ్యాను ఢీకొని పాల వ్యాపారి దుర్మరణం

Published Sat, Nov 11 2023 1:26 AM

- - Sakshi

పెనమలూరు: వ్యాను ఢీకొని పాల వ్యాపారి దుర్మరణం చెందిన ఘటన పోరంకి వద్ద చోటుచేసుకుంది. కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన మందపాటి శివరామకృష్ణ (42) పాల వ్యాపారం చేస్తాడు. గురువారం రాత్రి బైక్‌ పై పాలు అమ్మటానికి కుందేరు నుంచి బయలుదేరాడు. పోరంకి సెంటర్‌ వద్దకు రాగా ఎదురుగా వచ్చిన వ్యాను ఎటువంటి సిగ్నల్‌ ఇవ్వకుండా మలుపు తిప్పటంతో శివరామకృష్ణను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమవ్వటంతో బాధితుడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర చికిత్సకై చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శివరామకృష్ణ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

1/1

Advertisement
Advertisement