పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్న వ్యక్తిపై కేసు | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్న వ్యక్తిపై కేసు

Published Sun, Nov 12 2023 1:46 AM

-

పెనమలూరు: తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే వాట్సాప్‌లో ఫొటోలు పెట్టి అల్లరి చేస్తానని ఓ యువతిని బెదిరించిన వ్యక్తిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు శివపార్వతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు సంతానం. వారిద్దరూ బీటెక్‌ చదివి ఐర్లాండ్‌లో ఉంటున్నారు. ఆయన కుమార్తెకు ఆమె స్నేహితురాలి ద్వారా సాదం శశిధర్‌ అనే వ్యక్తి ఫోన్‌లో పరిచయమయ్యాడు. తనకు విదేశాలకు వెళ్లాలని ఉందని, తనను వివాహం చేసుకోవాలని అతను వెంటపడసాగాడు. ఈ నేపథ్యంలో పెద్దల మధ్య జరిగిన చర్చల్లో శశిధర్‌ కుటుంబ సభ్యులు అఽధిక కట్నం అడగటంతో ఆమె తండ్రి నిరాకరించాడు. దీంతో శశిధర్‌ బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు. తనకు ఆమెను ఇచ్చి వివాహం చేయకపోతే ఫొటోలు వాట్సాప్‌లో, సోషల్‌ మీడియాలో పెట్టి అల్లరి చేస్తానని బెదిరిస్తున్నాడు. తాను ఐర్లాండ్‌ వెళ్లి ఆమె అంతు చూస్తానని ఫోన్‌లో బెదిరించసాగాడు. ఘటనపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో శశిధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement