ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Nov 12 2023 1:46 AM

నివాళులర్పిస్తున్న 
ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు  - Sakshi

చల్లపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చల్లపల్లికి చెందిన కళ్లేపల్లి చంద్ర (48)కు భార్య, బీటెక్‌ చదివే కుమారుడు, ఇంటర్‌ చదివే కుమార్తె ఉన్నారు. అతను కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. చంద్ర ఈ విద్యా సంవత్సరంలో పిల్లల ఫీజులు కట్టడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. తాజాగా కుమారుడి హాస్టల్‌ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. శుక్రవారం రాత్రి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ముందు అతను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ సీహెచ్‌ నాగప్రసాద్‌, ఎస్‌ఐ సీహెచ్‌ చినబాబు ఘటనా స్థలిని పరిశీలించారు. చంద్ర భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి భౌతికకాయాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో దుర్గా ప్రసాద్‌ శవ పంచనామా చేశారు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతని మృతదేహం వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు, వికాస్‌ బాబు, మాజీ డిఫ్యూటీ స్పీకర్‌ బుద్ధప్రసాద్‌ తదితరులు నివాళులర్పించారు.

Advertisement
Advertisement