31 నుంచి కేయూలో కృష్ణా తరంగ్‌ | Sakshi
Sakshi News home page

31 నుంచి కేయూలో కృష్ణా తరంగ్‌

Published Wed, Nov 22 2023 1:16 AM

కృష్ణా తరంగ్‌ – 2023కు సంబంధించిన వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న వీసీ జ్ఞానమణి  - Sakshi

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు కృష్ణా తరంగ్‌ – 2023 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేయూ ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి తెలిపారు. ఆయన తన చాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయం పరిధిలోని 200 కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సుమారు 2000 మంది హాజరవుతారని తెలిపారు. ఐదు విభాగాలకు సంబంధించి 27 అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. వీటిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు దక్షిణ మండల (సౌత్‌జోన్‌) పరిధిలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమ నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విశ్వవిద్యాలయం ఉద్యోగులను కోరారు. అనంతరం కార్యక్రమ వాల్‌పోస్టర్లను వీసీ ఆవిష్కరించారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వీరబ్రహ్మచారి, ఆచార్య సుందరకృష్ణ, ఆచార్య దిలీప్‌ సహచర్యులు, ఆచార్య కోటేశ్వరరావు, లావణ్య లత, డాక్టర్‌ శ్రావణి డాక్టర్‌ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement