యార్డులో 36,667 బస్తాల మిర్చి విక్రయం | Sakshi
Sakshi News home page

యార్డులో 36,667 బస్తాల మిర్చి విక్రయం

Published Wed, Nov 22 2023 1:16 AM

- - Sakshi

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు మంగళవారం 36,117 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 36,667 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 24,000 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.8,000 నుంచి రూ.23,000 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.8,000 నుంచి 24,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.12,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 10,812 బస్తాల మిర్చి ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement