దీప నీరాజనం | Sakshi
Sakshi News home page

దీప నీరాజనం

Published Sun, Dec 3 2023 1:32 AM

హారతి కనుమా.. మండపంలో హారతులు ప్రదర్శిస్తున్న వేద పండితులు - Sakshi

కృష్ణాతీరం దేదీప్యమానంగా వెలుగొందింది. కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన మహిళా భక్తులు వెలిగించిన జ్యోతులతో ప్రకాశమానమై మెరిసింది. మట్టి ప్రమిదలు, ఒత్తులను సమకూర్చి వెలిగించిన దీపాలను అరటి డొప్పల్లో పెట్టి నదిలో వదలడంతో కృష్ణవేణి కార్తిక కాంతులతో ప్రజ్వరిల్లింది. నాగాయలంక కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్‌ వద్ద శనివారం రాత్రి కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఆలయ ప్రాంగణంతో పాటు ఘాట్‌లో అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది, దీపాలను వెలిగించి కార్తిక వైభవాన్ని చాటారు. వేదపండితులు రామలింగేశ్వరుడికి నవహారతులు నిర్వహించారు. – నాగాయలంక

Advertisement

తప్పక చదవండి

Advertisement