గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల హెడ్ క్వార్టర్స్లోను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 24 గంటలు విధులు నిర్వహించేలా అధికారులు సిబ్బందిని నియమించామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
కోనేరుసెంటర్: మిచాంగ్ తుపాను కారణంగా మంగినపూడిబీచ్, పెదపట్నం ప్రాంతాల్లో ఆదివారం కార్తికమాస పుణ్యస్నానాలను నిషేధిస్తున్నట్లు బందరు రూరల్ ఎస్ఐ చాణక్య తెలిపారు.