10న రాష్ట్ర మహాసభ | Sakshi
Sakshi News home page

10న రాష్ట్ర మహాసభ

Published Wed, Dec 6 2023 1:48 AM

-

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ జేఏసీ, అమరావతి అనుబంధ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 10వ తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రాష్ట్రస్థాయి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రథమ మహాసభ జరుగుతుందని జేఏసీ రాష్ట్ర అసోసియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణి పేర్రాజు తెలిపారు. మంగళవారం విజయవాడ గవర్నర్‌పేటలోని ఏపీఆర్‌ఏఎస్‌ఏ భవలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 10న రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటామన్నారు. మహాసభ వేదిక ద్వారా ప్రభుత్వానికి సమస్యలు విన్నవిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఏజెన్సీల దోపిడీకి బలవుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం విముక్తి కల్పించిందన్నారు. ఔటసోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆప్కాస్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందిస్తోందన్నారు. ఈ విషయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు జరిగిందన్నారు. సమావేశంలో ఎన్టీఆర్‌ జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ డి.ఈశ్వర్‌, అసోసియేట్‌ చైర్మన్‌ డి.శ్రీనివాస్‌, బత్తిన రామకృష్ణ, అల్లం సురేష్‌బాబు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement