ఈత పోటీల్లో పతకాల పంట | Sakshi
Sakshi News home page

ఈత పోటీల్లో పతకాల పంట

Published Sun, Dec 10 2023 2:10 AM

పతకాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ రత్నప్రసాద్‌  - Sakshi

పెనమలూరు: జేఎన్‌టీయూకే ఇంటర్‌ కాలేజీ ఈత పోటీల్లో కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు పతకాల పంట పండించారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన జేఎన్‌టీయూ ఈత పోటీల్లో ఐదుగురు విద్యార్థులు ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచారు. 50, 100, 200 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌, 50, 100, 200, 800 మీటర్ల ఫ్రీస్టైల్‌, 50, 100, 200 మీటర్ల బ్రెస్టు స్ట్రోక్‌ విభాగంలో 15 బంగారు, ఏడు రజత, రెండు కాంశ్య పతకాలు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా కాలేజీలో శనివారం పతకాలు సాధించిన విద్యార్థులు జి.శశివర్థన్‌, సీహెచ్‌.మౌనిక, ఎస్‌.కీర్తన, ఎం.దేవీదుర్గసుదీష్ణ, ఆర్‌.గిరీష్‌కుమార్‌ను ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.వి.రత్నప్రసాద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోతిన రఘు తదితరులఅభినందించారు.

Advertisement
Advertisement