Sakshi News home page

ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలి

Published Sat, Jan 6 2024 2:02 AM

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో  మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి శీలం  - Sakshi

కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం

మచిలీపట్నంటౌన్‌: దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజాసంఘాల ప్రతినిధుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శీలం మాట్లాడుతూ భారత దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సుస్థిరమైన ప్రజాస్వామ్య బద్ధ ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాలు కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావాలని కోరారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి మొవ్వ మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు గొల్లు కృష్ణ, కొరివి వినయ్‌కుమార్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లాం తాంతియాకుమారి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సాకే శంకర్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షురాలు పి.శాంతకుమారి, నగర కాంగ్రెస్‌ నాయకులు అబ్దుల్‌ మతీన్‌, కోక ఫణిభూషణ్‌, కొడమంచిలి చంద్రశేఖర్‌, నల్లబ్రోలు కుమారి, చిలుకోటి ప్రసాద్‌, సీపీఐ నాయకుడు లింగం ఫిలిప్‌, సీపీఎం నాయకులు బూర సుబ్రహ్మణ్యం, కొడాలి శర్మ, కుల వివక్ష పోరాట సమితి నాయకుడు సీహెచ్‌ రాజేష్‌, సీఐటీయూ నాయకుడు చిరువోలు జయరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement