పెనమలూరు: హైకోర్టు ఆదేశాల మేరకు గత కొంత కాలంగా వివాదంలో ఉన్న యనమలకుదురు ఈద్గా, కబరస్తాన్ వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్.అబ్దుల్ఖాదిర్ ఉత్తర్వులు జారీ చేశారు. యనమలకుదురులో ఈద్గా, కబరస్తాన్తో పాటు 26 దుకాణాల సముదాయం దాదాపు 2.73 ఎకరాల్లో ఉంది. చాలా కాలంగా ఒక వ్యక్తి చేతిలోనే ఆస్తులు ఉండటంతో వివాదం తలెత్తింది. కమిటీ వేసి దాని పర్యవేక్షణలోనే పాలన సాగించాలని మరో వర్గం పట్టుబట్టింది. ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించిన రెండవ వర్గం హైకోర్టులో కేసు వేసింది. కేసు పూర్వపరాలు విచారించి కబరస్తాన్, ఈద్గా, దుకాణాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు వక్ఫ్ బోర్డును ఆదేశించింది. దీంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా బోర్డు ఇన్స్పెక్టర్ ఎండి.నూహుఆలీషా ఈద్గా, కబరస్తాన్, దుకాణాలు తమ పరిధిలోకి తీసుకొస్తూ సీఈవో ఉత్తర్వులను ఈద్గాకు అంటించారు. హుండీకి సీల్ చేశారు. ఇక మీదట దుకాణాల అద్దె, కరెంట్ బిల్లులు , ఈద్గా పాలన , ఇతర మెయింటెనెన్స్, జమా ఖర్చులు ఇన్స్పెక్టర్ ఆడిటర్, ఏపీ వక్ఫ్ బోర్డు అసిస్టెంట్ సెక్రెటరీ పర్యవేక్షిస్తారు. ఈ మేరకు జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి ఆస్తులపై వచ్చే సొమ్ము జమ చేస్తారు. ఈ సందర్భంగా జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఎండి.నుహుఆలీషా మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో ఆస్తులు పంచనామా చేశామన్నారు. దుకాణాల్లో ఉండే అద్దె దారులు అద్దె సొమ్ము బ్యాంకు ఖాతాలో మాత్రమే తప్పనిసరిగా జమ చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు.
వక్ఫ్ బోర్డు పరిధిలోకి ఆస్తులు
Published Thu, Jan 18 2024 1:56 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement